ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలని జనసేన డిమాండ్

కుకునూర్ మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో కుకునూర్ మండలంలోని కుకునూర్, చీరవల్లి, అమరవరం ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, స్కూల్స్ తెరిచి నేటికి నెలలు గడుస్తున్నా ఇప్పటికి స్కూల్ అసిస్టెంట్ లెక్కలు, ఫిసికల్ సైన్స్, తెలుగు పండిట్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. వాటిని ఇంతవరకు భర్తీ చేయలేదు. కావున ప్రభుత్వం ఇప్పటికయినా మేల్కొని పోస్టులు భర్తీ చేసి విద్యార్థుల భవిషత్ ను కాపాడాలని కుకునూర్ మండల జనసేన అధ్యక్షుడు ములిశెట్టి యోగంధర్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ పోస్టుల కారణంగా విద్యా బోధన జరగకుండా పరీక్షలు నిర్వహించడం చాలా అన్యాయం అని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే మాత్రం జనసేన పార్టీ తరుపున ఏ పోరాటానికి అయిన సిద్ధం అని రానున్న రోజులు 10వ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచి ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఇంచార్జ్ చిర్రి బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి మొదుంపరపు వెంకన్నబాబు, ప్రచార కార్యదర్శి సమయమంతుల లక్ష్మణ్ స్వామి, రవి ప్రసాద్, శ్రీను, సీతారాముల, కృష్ణా, సాయి, తదితరులు పాల్గొన్నారు.