ఇంటింటికీ జనసేన – తెలుగుదేశం – బిజెపి త్రిశూల వ్యూహం

రాజానగరం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపే లక్ష్యంగా.. రాజానగరం నియోజకవర్గ శాసనసభ స్థానం నుండి జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ బత్తుల బలరామకృష్ణ గారిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని.. మూడు మండలాల్లో మూడు చోట్ల.. ఇంటింటికీ జనసేన – తెలుగుదేశం – బిజెపి త్రిశూల వ్యూహం నిర్వహించారు. కోరుకొండ మండలం గాదరాడ గ్రామం, కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో రాజానగరం మండలం మల్లంపూడి గ్రామం, రాజానగరం మండలం రాజానగరం గ్రామాల్లో.. జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించామని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, యువజన నాయకులు శ్రీ తోట పవన్ కుమార్, వీరమహిళా సాధికార కమిటీ కొర్-ఆర్డినేటర్ శ్రీమతి తోట ప్రత్యూష దేవి, కుమారి బత్తుల వందనాంబిక ఎన్నికల ప్రచారం చేసారు. జనసేన నాయకులు, టిడిపి నాయకులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాలను గమనించి వందలాదిగా పాల్గొని జయప్రదం చేసారు.