అట్టహాసంగా ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం

రాజంపేట: ఉమ్నడి పార్టీల ఆధ్వర్యంలో ఇంటింటికీ ఎన్నికల ప్రచారంలో రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని మరియు ఎమ్మెల్యే అభ్యర్తి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంలను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న జనసేన -టీడీపీ – బీజేపీ – శ్రేణులు పాల్గొన్నారు. ఉమ్మడి కడపజిల్లా రాజంపేట పట్టణంలో వున్న స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర తెలుగుదేశం – బీజేపీ – జనసేన పార్టీల నాయకులతో కలిసి ముందుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నేతలు.
అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని ఈడిగపాలెం, 2వ వార్డు నందు ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు రాజంపేట జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు. ఉమ్మడి అభ్యర్టులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం అని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, కత్తి సుబ్బరాయుడు, వెంకటయ్య, పత్తి నారాయణ, నారదాసు రామచంద్ర, గాజుల కుళాయప్ప, మౌల, రామా శ్రీనివాసులు, శంకర రాజు, సాయి రాజు, చింతలశివ, సాయి శ్రీనివాసులు, అబ్బిగారి గోపాల్, రాజేష్ వర్మ, గోవర్ధన్, మణి, చంద్రశేఖర్, సురేష్, నగరాజ, చిన్నబ్బి, మస్తాన్, సంతోష్, శ్రీను, రామయ్య, గౌతం మరియు జనసేన శ్రేణులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.