రాజానగరంలో జన జాగృతి యాత్ర
రాజానగరం నియోజవర్గం, రాజానగరం మండలం 15 వ రోజు జనసేన జన జాగృతి యాత్ర తేనేటి విందు కార్యక్రమం కలవచర్ల గ్రామంలో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్త ఆదేశాల మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. జన జాగృతి యాత్రలో భాగంగా కలవచర్ల జనసేన పార్టీ యువ నాయకులు రాజానగరం మండలం సోషల్ మీడియా ఇంచార్జ్ చల్లా ప్రసాద్ వాళ్ళ తండ్రి చల్లా బాపిరాజు రాజు కలిసి నా సేన కోసం నా వంతు కు 5000₹ చెక్కుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ కి జనసైనికుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆర్థిక సహాయంతో కలవచర్ల కబడ్డీ టీంకి జెర్సి అందించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్. ఈ కార్యక్రమంలో చల్లా రాము, అడ్డాల భగవాన్, పిల్లా సుబ్రహ్మణ్యం, చల్లా వీరన్న, జగదీష్, కొల్లూరి సతీష్, సబ్బు గణేష్, రాజానగరం మండలం జనసేన పార్టీ కార్యదర్శి నల్లమిల్లి విష్ణు చక్రం, రమేష్, వీరబాబు, చల్లా వీరబాబు, చదువు ముక్తేశ్వరరావు, తన్నీరు తాతాజీ, అరుబోలు బాలు, అడపా అంజిబాబు, కోలా ప్రసాద్ జనసైనికులు మరియు కలవచర్ల గ్రామ పెద్దలు, కలవచర్ల జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-23-at-22.13.01-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-23-at-23.32.00-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-23-at-23.32.00-1-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-23-at-23.32.02-1024x683.jpeg)