అభివృద్ధితో కూడిన సంక్షేమ పరిపాలన అందించడానికి జనసేన, టీడీపీ సిద్ధం

  • ప్రజా కంటక పాలనకి చరమ గీతం
  • సాయి నగర్ ఏరియాలో జనంలోకి జనసేన

వైజాగ్ నార్త్: పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు ఇంటింటికి తీసుకునే విధంగా జనంలోకి జనసేన కార్యక్రమం 50వ వార్డ్ లో సనపల శివ సాగర్ ఆధ్యర్యంలో సాయి నగర్ ఏరియాలో నిర్వహించడం జరిగింది. ప్రజా కంటక పాలనకి చరమ గీతం పాడటానికి కేవలం 70 రోజుల సమయం మాత్రమే వుంది. అభివృద్ధితో కూడిన సంక్షేమ సుపరిపాలన అందించడానికి జనసేన, టీడీపీ సంసిద్ధంగా వుంది అని, ఆశీర్వదించండి అని ఇంచార్జి ఉషా కిరణ్ మరియు సీనియర్ నాయకులు సంకు వెంకటేశ్వర రావులు అన్నారు. ఈ కార్యక్రమంలో నానాజీ, రామ్ నాయుడు, చక్రధర్, నాగమణి, అప్పారావు, శ్రీధర్, దివాకర్ అధిక సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.