పేద రైతుల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని జనసేన డిమాండ్

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద బలివే గ్రామంలో రైతుల వద్ద కోర్టులో ఉన్న రైతులు స్థలాలను జగనన్న కాలనీల పేరిట ఎలా కేటాయిస్తారు అని అన్నారు. వారికి ఇంత వరకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులు పెడుతున్నారని వారికి వేరే చోట స్థలం కేటాయించి న్యాయం చేయాలని నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు వారి సమస్యను సోమవారం మండల తహశీల్దార్ అధికారిని సుధరాణికి స్పందనలో అర్జీ అందచేసి బాధితులతో కలిసి వివరించడం జరిగింది. ఎమ్మార్వో వారి సమస్య పరిష్కరానికి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బాధితులతో పాటు మండల మండల జనసేన నాయకులు చేబత్తిన విజయ్, రాజారావు, గిరి గోపి, మట్ట స్వామి, బ్రహ్మయ్య, గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.