మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని జనసేన డిమాండ్

ధర్మవరం నియోజకవర్గం, తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లి గ్రామ సమీపంలో గుడ్డంపల్లి గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ప్రయాణిస్తున్న ఆటో పై విద్యుత్ వైర్లు తగలడంతో ఆటో పూర్తిగా కాలిపోయింది, ఈ ప్రమాదంలో 6 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై పరిశీలిస్తూ మృతుల కుటుంబాన్ని పరామర్శించి భౌతిక కాయాలను పరిశీలించి తీవ్ర ఆవేదనకు గురై మీడియా ముఖంగా మాట్లాడుతూ ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనంటూ మృతి చెందిన కుటుంబాలకు వెంటనే 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి క్షతగాత్రులకు 10 లక్షల రూపాయలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధానకార్యదర్శి భవాని రవి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.