పత్తికొండ జనసేన ఆధ్వర్యంలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

పత్తికొండ నియోజకవర్గం, వెల్దుర్తి మండలంలో మూడవ రోజు #GoodMoringCMSir ప్రోగ్రాం వెల్దుర్తి మండలం నాయకులు బాబ్జి, పరమేష్, రెడ్డి పోగు నాగరాజ్, బడోల్ల ఆదెన్న ఆధ్వర్యంలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ… జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ల ఆదేశాల మేరకు రాష్ట్రంలో రోడ్ల అద్వాన పరిస్థితులను తెలియజేస్తూ, గాఢ నిద్రలో ఉన్న సీఎంను నిద్రలేపడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో #GoodMoringCMSir డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా, ఆదివారం వెల్దుర్తి మండలం వెల్దుర్తి రామళ్లకోట పుల్లగుమ్మి కలగొట్ల ఉయ్యాలవాడ మీదుగా నన్నూరు వెళ్లే రోడ్డు మరుమతులు వెంటనే చేపట్టాలని, #GoodMoringCMSir డిజిటల్ ప్రోగ్రాం ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే గత సంవత్సరం రోడ్లు గురించి #JSPAPROADS అనే డిజిటల్ క్యాంప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గాడమైన నిద్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని నిద్ర లేపడం వల్ల ఆంధ్రప్రదేశ్ రోడ్లగురించి సీఎం జగన్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లన్నీ 2022లో జూన్ లోపల బాగు చేస్తామని చెప్పి, ఇప్పటికి కూడా రోడ్లకు మరమ్మత్తులు అనేక చోట్ల చేపట్టకు పోవడం, చాలా బాధాకరమైన విషయం, మన రాష్ట్రంలో అనేకసార్లు బస్సు చార్జీలు పెంచిన జగన్ మోహన్ రెడ్డి రోడ్ల గురించి ఎందుకు పట్టడం లేదు, ఇప్పటికైన నిద్రపోతున్న సీఎంని మరోసారి నిద్ర లేపుతూ… రాష్ట్రంలో ఉన్న అన్ని రోడ్లకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండలం నాయకులు బాబ్జి, నాగరాజ్, పుల్లగుమ్మి పరమేష్ కలగొట్ల ఆది, గద్దల రాజు, నాగేశ్వరరావు, చిరంజీవి, నరసింహుడు, భాస్కర్ మరియు తదితరులు పాల్గొన్నారు.