జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపిన చిర్రి బాలరాజు

పోలవరంపై కేంద్రమే చొరవ చూపాలని నిర్వాసితులకు పునరావాసాన్ని పట్టించుకోవడం లేదని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర శేఖవత్ తో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి చర్చించడం జరిగింది. పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, ఆంధ్రరాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ బహుళార్థక ప్రయోజనాలు అందిస్తుందని, ఇంతటి ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంలో నిధుల కొరత పేరుతో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మంత్రికి పార్టీ తరుపున అభ్యర్ధించడం హర్షనీయమని పోలవరం నియోజకవర్గం నుంచి నిర్వాసితుల తరుపున పవన్ కళ్యాణ్ కి పోలవరం నియోజకవర్గ ఇంచార్జి చిర్రి బాలరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపడం జరీగంది.