జనసేన – పల్లెబాటలో డాక్టర్ గౌతమ్ రాజ్!!

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు… జనసేన – పల్లెబాట కార్యక్రమంలో భాగంగా… ప్రకాశం జిల్లా, దోర్నాల మండలం, తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గౌతమ్ రాజు ఇంటింటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు…
అనంతరం గ్రామంలోని ప్రజలతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు..
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్ద దింపే దాకా ప్రతి ఒక్క జనసైనికుడు ప్రభుత్వం పై పోరాటం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు ఇంచార్జ్ గౌతమ్ రాజు పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు జనసైనికులు పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *