రామగిరి గిరిజన గ్రామంలో జనంలోకి జనసేన మేనిఫెస్టో

తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, పిచ్చాటూర్ మండలం, రామగిరి గిరిజన గ్రామం నందు జనసేన పార్టీ మేనిఫెస్టో జనాల్లోకి తీసుకెళ్లడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటికీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, మనోగతాలను వివరిస్తూ.. ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో చేయబోయే వివిధ కార్యక్రమాలు, పేద ప్రజలకు చేయబోయే మంచి పనుల గురించి, అలాగే పవన్ కళ్యాణ్ ఇంతవరకు చేసిన మంచి పనులు ఉదార స్వభావంతో పేద కుటుంబాలకి మరియు కౌలు రైతుల కుటుంబాలకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలను ప్రతీ ఇంటికి వివరిస్తూ 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయమని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి తడ శ్రీనివాసులు, మడల నాయకులు సుగంధర్ర్, చిరంజీవి, మారైయ్య, రాజశేఖర్, ప్రభు స్టీఫెన్, ప్రకాష్, గాంధీ, అగస్టిన్, శ్యామ్, చంద్రు, హరీష్, జభస్తీన్, అంబ్రుత్ తదితరులు పాల్గొన్నారు.