రాజోలు నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం సెంటర్ లో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నియోజకవర్గ సమన్వయ కర్త గుండుబోగుల పెద్దకాపు, మండల అధ్యక్షులు మల్లిపుడి సత్తిబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు బోల్లం ప్రసాద్ అధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనవాణి కన్వీనర్ దేవా వర ప్రసాద్, డాక్టర్ రాపాక రమేష్ బాబు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వార్డ్ మెంబర్లు వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.