ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అశ్వారావుపేట: భద్రాద్రి ములకలపల్లి మండల కేంద్రంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ములకలపల్లి మండలంలో మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ.. ములకలపల్లి మండల వ్యాప్తంగా పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. మునుముందు పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పరిష్కారం దిశగా, పోరాటమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా యువజన నాయకులు గరికే రాంబాబు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులకు ప్రత్యేకధన్యవాదాలు తెలియజేస్తూ, పోటీ చేసిన నియోజకవర్గలోఎలక్షన్లో పార్టీకి అండగా నిలబడి జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. అశ్వరావుపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పరిష్కారం మార్గంగా పోరాటంజరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ములకలపల్లి మండల ప్రధాన కార్యదర్శి గొల్ల వీరభద్రం ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బొక్క వెంకటేశ్వర్లు, నాగరాజు నాయక్, ఓకే నాగరాజు, జనసైనికులు పండు, చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.