కొండిశెట్టి ప్రవీణ్ ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

శింగనమల, సైకో పాలన నుండి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి జనసేన-టిడిపి-బిజెపి శ్రేణులందరూ కలసి కలసికట్టుగా నడుంబిగించాలని శింగనమల నియోజకవర్గ జనసేన నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం నార్పల మండల కేంద్రంలో జనసేనపార్టీ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనపార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులతో కలసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకే అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేనపార్టీ స్థాపించారని అన్నారు. ప్రతి ఒక్కరూ కలసికట్టుగా ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యోగానంద్, చింతా రామకృష్ణ, రహమతుల్లా, అమీర్ ఖాన్, బాబావలి, విజయ్, నజీర్, బన్నీ, కళ్యాణ్, పవన్, గిరీష్, ప్రదీప్, బ్రహ్మ, శీనా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *