పంతం నానాజీ ఇంటింటా ప్రచారం

కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం Z.బావారం గ్రామంలో కాకినాడ రూరల్ టీడీపీ కో-ఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి, కో-కో-ఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ మరియు కరప మండలం అధ్యక్షులు దేవు వెంకన్నతో కలిసి కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన-టీడీపి-బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ ఇంటింటా ప్రచారం చేస్తూ గాజు గ్లాసు గుర్తుకు వారి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ రాష్ట్రంలో, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జనసేన – టీడీపీ – బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన-టీడీపి-బీజేపీ పార్టీల నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.