జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షకు జనసేన మద్దతు

విజయనగరం: సుదీర్ఘకాలంగా ఉన్న ప్రెస్ క్లబ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు తమ ఆందోళనను ప్రెస్ క్లబ్ కొందరిది కాదు అందరిదీ అనే నినాదంతో ప్రెస్ క్లబ్ సాధన కోసం జర్నలిస్టులు సోమవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు, త్యాడ రామకృష్ణారావు(బాలు) మద్దతు పలికారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఆదాడ మాట్లాడుతూ పట్టణంలోని అంబటిసత్రం వద్ద ప్రభుత్వ నిధులతో రెండు దశాబ్దాల క్రితం నిర్మాణం జరిగిన ప్రెస్ క్లబ్ కు, నగరంలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ సదరు ప్రెస్ క్లబ్ లో భాగస్వామ్యం కల్పించి, తద్వారా జర్నలిస్టుల సంక్షేమంకి దోహద పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రెస్ క్లబ్ గత ఐదు ఏళ్లుగా ఎటువంటి నిర్వహణ లేక ఎవ్వరికీ పత్రికా సమావేశాలకు వీలులేక అచేతన స్థితిలో ఉండడం బాధాకరమని, ఈ ప్రెస్ క్లబ్ సమస్యను, ఇప్పటికైనా జిల్లా కలెక్టరు పరిష్కరించాలని డిమండ్ చేసారు.