పవన్ కళ్యాణ్ ని విమర్శించిన సూళ్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యే పై నిప్పులుచెరిగిన రోసనూరు సోమశేఖర్

సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం గుర్రపు తోట నుంచి పాలచ్చూరు గ్రామానికి వెళ్లే రోడ్డుని సందర్శించిన సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ రోడ్డు అత్యంత దారుణంగా తయారైంది అని స్థానిక సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవయ్య పై నిప్పులు చెరిగారు. సుమారు 7 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ రోడ్డుని ఒక దశాబ్దం పాటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుడి కళ్ళకి కనపడకపోవడం ఆశ్చర్యం వేస్తుంది అని వాపోయారు. గ్రామాల ప్రజలు అంటే ఈ శాసనసభ్యుడికి చిన్నచూపు, అసలు పట్టదేమో అనిపిస్తుంది అన్నారు. ఈ రోడ్డుమీద ప్రయాణించే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా ఎవరూ కూడా పట్టించుకోని పరిస్థితి, అభివృద్ధిని గాలికి వదిలేసిన ఈ వైసీపీ ప్రభుత్వం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రతిపక్షాల్ని విమర్శించడం, మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని రెండు చోట్ల ఓడిపోయాడు నాయకుడు కాదు లాంటి చౌకబారు మాటలు వైసీపీ ఎమ్మెల్యే అసమర్ధతకు అద్దం పడుతుంది అని ఎద్దేవా చేశారు. మీ ముసలి ప్రాయంలో సంజీవయ్య యువసేన అని పెట్టుకున్నప్పుడు ప్రజలు ఎలా నవ్వుకున్నారో, జనం కోసం పుట్టిన జనసేన ను రౌడిసేన అంటే ప్రజలు దేనితో నవ్వాలో అర్థం కావట్లేదు అంటూ సోమశేఖర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉన్న ఈ ఒక సంవత్సరంలో అయినా గ్రామాభివృద్ధి దిశగా అడుగులు వేయాలని వైసీపీ ఎమ్మెల్యే కి సూచించారు.