రేపాక.నాగేశ్వరరావు వ్రాసిన దివ్యాస్త్రం పుస్తకం విడుదల

గాజువాక: జనసేన పార్టీ మీడియా విభాగం హెడ్ హరి ప్రసాద్ రేపాక.నాగేశ్వరరావు వ్రాసిన 4వ పుస్తకం దివ్యాస్త్రం పుస్తకాన్ని బుధవారం గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ పర్సనల్ విభాగం టీం లీడర్ అంజి బాబు దివ్యాస్త్రం పుస్తకాన్ని విడుదల చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా అంజి బాబు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక నియోజకవర్గం నుండి పోటీ చేసేలా సరికొత్త కార్యాచరణతో ముందుకు వస్తారు అని.. గాజువాక నియోజకవర్గంలో నేటికీ 3 లక్షల 12 వేల మంది ఓటర్లు ఉన్నారు. వారందరిని ప్రభావితం చెయ్యమని, అలాగే మీ విలువైన సమయాన్ని ఉత్తరంధ్రాలో ఉన్న 34 నియోజకవర్గాలలో జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చెయ్యమని రేపాక.నాగేశ్వరరావుకు సూచించారు.