శ్రీమతి నారా భువనేశ్వరికి సంఘీభావం తెలిపిన జనసేన నాయకులు

కాకినాడ, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆదేశానుసారం టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా దీక్ష చేపట్టిన వారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలియజేసిన రాష్ట్ర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, కాకినాడ రూరల్ సీనియర్ నాయకులు బిరుదా బాబు, కాకినాడ జిల్లా యువ నాయకులు నున్న గణేష్ నాయుడు, కరప మండల జనసేన పార్టీ కార్యదర్శి గోన ఆంజనేయులు. ఈ సందర్భంగా రాష్ట్రంలో దుర్మార్గపు పాలన రాజ్యమేలుతుందని, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించిన వ్యక్తిపై రాజకీయ కక్ష సాధింపు చర్య సరైన పద్ధతి కాదని, చంద్రబాబు త్వరగా ప్రజల మధ్యకు వస్తారని వారికి ధైర్యం చెప్పడం జరిగింది.