పాలకుర్తిలో జనసేన ప్రచారం ప్రారంభిస్తాం: వెల్తూరి నగేష్

తెలంగాణ, పాలకుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ వెల్తూరి నగేష్ ఆధ్వర్యంలో పెద్దవంగర మండలంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో 32 నియోజకవర్గాలు పోటీ చేస్తుందని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ 32 స్థానాలలో పాలకుర్తి నియోజకవర్గం కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. మిత్రులారా పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రచార కార్యక్రమాలు ప్రారంభం జరుగుతుందని అదేవిధంగా ఈ నెలలో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరియు ఈ బహిరంగ సభ కోసం ఒక ప్రచార వెహికల్ కూడా ప్రారంభిస్తున్నామని, త్వరలో మీకు ఈ విషయాలు ప్రకటిస్తామని ఈ సమావేశానికి హాజరైన ఎలక్ట్రాన్ మరియు మీడియా మిత్రులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కొండ్లె ఉమేష్, డివిజన్ ఉపాధ్యక్షులు జలకం శివ కుమార్, పెద్దవంగర జనసేన పార్టీ మండల అధ్యక్షులు కసరబోయిన రాజశేఖర్, ఉపాధ్యక్షులు గద్దల అశోక్ తదితరులు పాల్గొన్నారు.