ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వికలాంగుడికి జనసేన నాయకుల ఆర్థిక సహాయం

  • ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వికలాంగుడికి జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ ల ఆర్థిక సహాయం

శ్రీకాకుళం జిల్లాకు చెందిన వికలాంగుడైన యువకుడు నేయిల ప్రసాద్ ప్రత్యేక హోదా కోసం ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు తన మూడు చక్రాల సైకిల్ మీద యాత్ర చేపట్టి విజయవంతంగా పూర్తి చేసుకొన్నారు. నంద్యాలలో జనసేన నాయకులు చందు, సుందర్ లు ఆయనకు సన్మానం చేసి 5000/- ఆర్థిక సహాయం అందించారు. రాచమడుగు సుందర్ మాట్లాడుతూ నేయిల ప్రసాద్ గారి యాత్ర స్ఫూర్తి దాయకం అని, ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నారని, ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అభినందించారు. నంద్యాల జనసేన పార్టీ తరఫున ఆయనకు ఎప్పుడు అండగా ఉంటామని హామి ఇచ్చారు. రాచమడుగు చందు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రసాద్ పోరాటం వృధా కాదని, సెప్టెంబర్ 10వ తారీఖున ప్రసాద్ ఢిల్లీ చేరుకొని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గళాన్ని జంతర్ మంతర్ జంక్షన్లో వినిపించబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జనసేన నాయకులు సాయి ప్రదీప్ రెడ్డి, జనసైనికులు ఫక్రుద్దీన్, చిన్న, రవి తదితరులు పాల్గొన్నారు.