న్యాయవాదుల రిలే నిరాహార దీక్షకు మద్దతుగా జనసేన నాయకులు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణ యందు భూ హక్కుల చట్టం 27/2023 ను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు జనసేన పార్టీ తరఫున నెల్లూరు జిల్లా నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రథమ స్థానంలో రాష్ట్రం నిలిచింది. స్థానిక ఎమ్మార్వో సంతకంతో భూహక్కును నిర్ణయించడం అనేది సబబు కాదు. అదే విధంగా ఆ హక్కును ప్రశ్నించాలంటే ఆశ్రయించాలంటే హైకోర్టులో మాత్రమే అనుమతులు వేయడం సబబు కాదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక 100 రోజులతో ముగియనున్న వీరి అదికారాన్ని కాలంలో శాశ్వతంగా అధికారంలోకి రాకుండా చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. బాధితులకు కష్టనష్టాలను మనసులో ఉంచుకొని న్యాయవాదులు చేస్తున్న న్యాయపోరాటానికి మద్దతుగా జనసేన పార్టీ ఉంటుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, నాయకులు నాగబాబు, నాదెండ్ల మనోహర్ గారికి అజయ్ గారికి తెలియపరచి వారి సమస్య పరిష్కరించే వరకు కూడా జనసేన పార్టీని తరఫున నిలుస్తామని తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ ఇంచార్జ్ చదలవాడ రాజేష్, జనసేన నాయకులు కాకు మురళి రెడ్డి, అడ్వకేట్స్ రమేష్ ప్రతాపు, శ్రీనివాసులు, శేఖర్, శ్రీను, మధు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,జిల్లా ఉపాధ్యక్షులు సుదీర్ బద్దిపూడి, కోవూరుటేకర్ గుడి హరి రెడ్డి, జనసేన సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏటూరు రవి, వీర మహిళ నాగరత్నం,రేణుక,హైమావతి, ప్రశాంత్ గౌడ్, శరవణ, కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు సుధా మాధవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సందీప్, ఖలీల్, కేశవ తదితరులు పాల్గొన్నారు.
[14/12, 6:27 ప్మ్] ఘ్క్: ఇక పై లేఅవుట్ ప్లాన్ లలో పార్కులతో పాటు మద్యం దుకాణాలు కూడా చేరుస్తుందేమో ఈ వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలు ఇల్ల మధ్యలో ఏర్పాటు చేయడం వైసిపి ప్రభుత్వానికే చెల్లింది. మా ఆడబిడ్డలకు గృహిణులకు జనసేన పార్టీ లీగల్ సెల్ తో తోడుగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఎల్ల మధ్యలో పెట్టడాన్ని ఉపేక్షించేది లేదు. నెల్లూరు రూరల్ సెంటర్ లేఅవుట్ ఎదురుగా ఉన్న బాలాజీ గోల్డెన్ లేఔట్ నందు ఎల్లమ్మ కొత్తగా పెట్టడానికి ప్రయత్నిస్తూ స్థానిక మహిళలు గృహంలో నాలుగు రోజులుగా పోరాటం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాల్లో సరుకు పెట్టకుండా జనసేన, తెలుగుదేశం మరియు సిపిఎం నాయకులు స్థానికులు మహిళలు అందరూ అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ రోజు జనసేన పార్టీ తరఫున లీగల్ ఇన్చార్జ్ చదలవాడ రాజేష్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నివాస స్థలాల వద్ద కాపురస్తులను సందర్శించి వారి ఇబ్బందులను తెలుసుకొని లీగల్ సెల్ తరఫున అండగా ఉంటామని. ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం దుకాణం ఇక్కడ పెట్టనివ్వకుండా అడ్డకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తాను అన్న జగన్ ప్రభుత్వం మద్యం దుకాణాలు తగ్గించపోగా సేల్స్ పెంచుకొని వాటి ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. రియల్ ఎస్టేట్ ప్లాను లో పార్కులు, స్విమ్మింగ్ పూల్ తో పాటు మద్యం దుకాణంలో కూడా కొత్తగా అనుమతులు ఏర్పాటు చేసి రికార్డుకు ఎక్కుతుంది వైసిపి ప్రభుత్వం. 100 మీటర్ల దూరంలో మరో మద్యం దుకాణం ఉండంగా నివాస స్థలాల మధ్య కొత్తగా ఈ మద్య దుకాణం ఏర్పాటు చేయడానికి స్థానికులు ఎవరు ఒప్పుకోవడం లేదు. ఈ ప్రాంతంలో సాయంత్రం ఆరు దాటిన తర్వాత లైట్లు సరిగా లేనందువలన కార్పొరేషన్ లిమిట్లో ఉన్నప్పటికీ ఈ ప్రాంతమంతా అంధకారంలో ఉండి మహిళలు చిన్నపిల్లలు బయటికి రావాలంటేనే భయంగా ఉంది, ఆకతాయిలు తాగి ఇక్కడ తిరుగుతూ ఇబ్బందులుగా ఉన్నాయి. సమస్యలను మరింత ఉధృతం చేస్తూ నివాస స్థలాల మధ్య ముందు పక్క కొట్టుకి ఎక్స్టెన్షన్ గా మినీ బారిన ఏర్పాటు చేస్తున్నారు. ముందు పక్క మందు కొనుక్కున్నవారు వెనక పక్క ఇళ్లకు ముందుగా రూముల్లో కూర్చుని తాగి ఏదైనా చేయొచ్చు అనేది ప్రభుత్వం అనుమతులుగా భావిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు ఇక్కడికి వచ్చి దుకాణం పెట్టకుండా ఎలా అవుతారో మీ సంగతి చూస్తామని బెదిరించడం ఖండించాల్సిన విషయం. ప్రజా వ్యతిరేకత ఉంటే ఆయా స్థలాల్లో మద్యం దుకాణాల్లో పెట్టకూడదని కోర్టు చెప్తోంది. ఈ సమస్య పై న్యాయపోరాటం గా కూడా చేస్తాం.కార్పొరేషన్ కమిషనర్, ఎస్పీ, కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్ అందరికీ అర్జీలు పంపటం జరిగింది. స్పందన లో కలెక్టర్ గారిని కలిసి చర్యలు తీసుకొని న్యాయం జరుగకపోతే న్యాయ పోరాటానికి జనసేన పార్టీ తరఫున స్థానికులతో సిద్ధమవుతామని తెలిపారు. మద్యం దుకాణానికి ఏర్పాటు చేసిన గ్రిల్స్ తీయించే వరకూ కూడా జనసేన మీకు తోడు ఉంటుందని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ జిల్లా ఇన్చార్జి చదలవాడ రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల, జిల్లా ఉపాధ్యక్షుడు బద్దిపూడి సుదీర్, కార్యదర్శి ప్రశాంత గౌడ్, హేమచంద్ర యాదవ్, కేశవ్, ఖలీల్రేణుక తదితరులు పాల్గొన్నారు.