తుని నియోజకవర్గంలో పలువురిని పరామర్శించిన జనసేన నాయకులు

తుని నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు దారకొండ వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన నాయకులు మండలంలోని పలువురిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ముందుగా చెయ్యి ఫ్రాక్చర్ కి గురైన వెలమ కొత్తూరు కాలనీ గ్రామస్తులు నాళం రమేష్ ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం టి. వెంకటాపురం గ్రామానికి చెందిన జనసేన వీరమహిళ నాయకురాలు పోతుల సత్యవతి మాతృమూర్తి పిల్లి నాగరత్నం స్వర్గస్తులు కాగా వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన చెయ్యి ఫ్రాక్చర్ కి గురైన జనసైనికుడు గొర్ల కృష్ణ ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గొర్ల సాల్మన్ రాజు, నిమ్మల లోవ సూరిబాబు, అదేపల్లి బాలాజీ, లట్టల నాగేశ్వరావు, పెనిమొచ్చి నాగూర్, సిద్దిరెడ్డి రాము, బొట్టా నానాజీ, అందరూ కలిసి రమేష్ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు మేమున్నామని ధైర్యం చెప్పి పరామర్శించారు.