జనసేన పార్టీ ఆవిర్భావ 11వ దినోత్సవ వేడుకలు

నెల్లూరు సిటీ 11వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నెల్లూరు సిటీ సుబేదార్ పేట నందు గల వారి కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో జనసేన పతాక ఆవిష్కరణ చేసి అనంతరం కేక్ కట్ చేసి వేడుకగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….

రేపటి తరానికి భరోసా ఈ జెండా,
సామాన్యులకు బలం ఈ జెండా,
రైతన్నలకు చేయూత ఈ జెండా,
అరాచకాలకు అడ్డుకట్ట ఈ జెండా,
యువత ఆశలకు ఊపిరి ఈ జెండా,
వెనుకబడిన వర్గాలకు అండ ఈ జెండా,
క్రిమినల్ రాజకీయాలకు సింహస్వప్నం ఈ జెండా,

తెలుగు ప్రజల ఆత్మగౌరవం జనసేన పార్టీ జెండా, భావితరాల బంగారు భవితకై ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని పోరాడుతున్న అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజా ప్రభుత్వానికి అందరూ మద్దతు ఇచ్చి గెలిపించవలసిందిగా కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అనుసారం జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ సూచనలతో జనసేన, బిజెపి, తెలుగుదేశం పార్టీల అభ్యర్థుల గెలుపుకై కష్టపడి జనసేన పార్టీ ఉన్నత ఆశయాలని నిలబెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.