ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు గుర్తొచ్చే పార్టీ జనసేన పార్టీ

  • మిచౌంగ్ తుఫాను బాదిత 100 కుటుంబాలకు పులిహోర, నీరు బాటిల్స్, బ్రెడ్ పాకెట్స్ అందజేసిన జనసేన పార్టీసంగం మండల నాయకులు

ఆత్మకూరు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు, జనసేన పార్టీ జాతీయ మీడియా అధ్యక్షుడు అజయ్ సూచన మేరకు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సలహా మేరకు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్, హరీష్ అన్న (ఎన్ ఆర్ ఐ) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం, సంగం మండలంలోని లోతట్టు గ్రామాలైన కోలగట్ల, సంగం, అనసూయ నగర్ తదితర గ్రామాలలో సంగం మండలం జనసేన పార్టీ నాయకులు కలిసి మిచౌంగ్ తుఫాన్ బాదిత 100 పైగా కుటుంబాలకు పులిహోర, వాటర్ బాటిల్, బ్రెడ్డు పాకెట్స్ తుఫాన్ బాధితులకు అందజేయడం జరిగినది. జనసేన పార్టీ ఆత్మకూరు నియోజవర్గ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో రోడ్లు అస్తవ్యస్తంగా తయారవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న 2024లో జనసేన-తెలుగుదేశం ప్రజా ప్రభుత్వాన్ని మద్దతుగా ప్రజలందరూ ఉండాలని కోరినారు. జనసేన-తెలుగుదేశం ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యలు తీర్చే దిశగా ఈ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా తుఫాన్ బాధితులను పరామర్శించారు. కార్యక్రమంలో ఆనందరావు, కృష్ణమోహన్, అనిల్, రవిచంద్ర, జయరాజ్, అనిల్, వంశి, నాగరాజ్, చంద్ర, తదితరులు పాల్గొనడం జరిగినది.