జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: డా. వంపూరు గంగులయ్య

అల్లూరీసీతారామరాజు జిల్లా పాడేరు: జనసేన పార్టీ పాడేరు మండల కార్యనిర్వహణ కమిటీ ఎన్నిక మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్బంగా అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య మాట్లాడుతూ.. ఈ కమిటీలో ప్రధాన భూమిక పోషించాల్సిన 4గురు సభ్యులు ప్రధాన బాధ్యతలు తీసుకుని పాడేరు మండలంలో గల వివిధ గ్రామాలను సందర్శిస్తూ, జనసేన పార్టీ అభిమానులను, జనసైనికులను, గిరిజన ప్రజలను ప్రధాన భాగస్వామ్యంతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా జనసేన పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ మీ యువతరం శక్తియుక్తులని వెలికి తీయాల్సిన సందర్భం ఇదేనని, ఈ కమిటీలో ఎన్నికైన పవన్ కుమార్ లంకెల, సలుగు దేవేంద్ర నాయుడు, చింతడ సతీష్, గెమ్మెలి నాగరాజు తదితర సబ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుల్లో ఒకరైన లంకెల పవన్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీ తరుపున మాకు ఈ బాధ్యత అప్పగించిన అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను, లక్ష్యాలను గిరిజన ప్రజలకు చేరవేస్తూ, రానున్న ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యనిర్వహణ కమిటీ ఎన్నికలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, జిల్లా కార్యనిర్వహన అధ్యక్షులు సురేష్ వంపూరు, జనసేన పార్టీ లీగల్ అధ్యక్షులు కిల్లో రాజన్, ఐ.టీ ఇన్చార్జ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.