మామిడి కుదురు మండల సర్వసభ్య సమావేశం

మామిడి కుదురు మండల ఎండిఓ ఆఫీసులో ఎంపీడీవో కే వెంకటేశ్వరరావు అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాత కాపు మరియు ఇతర సర్పంచులు, ఎంపీటీసీలు వ్యవసాయ అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పని కారణంగా సమావేశం నుంచి జనసేన మరియు టిడిపి సర్పంచులు ఎంపీటీసీలు సమావేశం నుండి వాకౌట్ చేయడం జరిగినది.