అణగారిన వర్గాల అభ్యున్నతే జనసేన ధ్యేయం: బత్తుల

  • నియోజకవర్గంలో చాప కింద నీరులా అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకర్షిస్తున్న బత్తుల నాయకత్వం
  • వైసిపి అసమర్థ, అరాచక పాలన వల్ల, మార్పు కోరుకుంటున్న ప్రజలు
  • అభివృద్ధిని గాలికి వదిలేసి నియోజకవర్గంలో వనరులను దోచుకుంటున్న వైసీపీ నాయకత్వంపై రాజానగరం నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.
  • దళితవాడల్లో రోజురోజుకీ జనసేన పెరుగుతున్న ఆదరణ

రాజానగరం: జనంకోసం జనసేన – మహాపాదయాత్ర 71వ రోజులో భాగంగా కోరుకొండ మండల కేంద్రం, సుబ్బారావు పేట (ఎస్సీ కాలనీ)లో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పర్యటించి, స్థానిక ప్రజలతో మమేకమవుతూ గాజుగ్లాస్ గుర్తుపై ఓటు వేసి, జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గంలో వనరులను దోచుకుంటున్న స్థానిక వైసీపీ నాయకత్వంపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని, ప్రజల్లో మార్పు స్పష్టంగా కనబడుతుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన పార్టీ డంకాపదంగా విజయం మోగిస్తుందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే జనసేన పార్టీ ఉద్భవించిందని సామాన్యులకు రాజ్యాధికారం కోసం, సమన్యాయం కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని.. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ మహాపాదయాత్రలో స్థానిక మండల సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.