జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి కార్యక్రమం

జగ్గయ్యపేట, ఉగాది పండుగని పురస్కరించుకొని శనివారం వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు పుల్లంశెట్టి శ్రీనివాసరావు రామిశెట్టి విశ్వేశ్వరరావు రామిశెట్టి అప్పారావు చేతులమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు ఇతర ప్రయాణికులు ఈ కార్యక్రమంలో పాల్గొని మజ్జిగ స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ చందు, రామకోటేశ్వరరావు, వీరమహిళ శైలజ పసుపులేటి నాగేశ్వరరావు, సాయి గోపినాధ్, విజయ్ హరీష్, సాయి, రాము తదితరులు పాల్గొన్నారు.