రాష్ట్రాభివృద్ధి జరగాలంటే జనసేన అధికారంలోకి రావాలి – డాక్టర్ కందుల నాగరాజు

వైజాగ్ సౌత్: రాష్ట్రాభివృద్ధి జరగాలంటే జనసేన ఖచ్చితంగా అధికారంలోకి రావాలిసిన అవసరం ఎంతైనా ఉందని దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. బుధవారం దక్షిణ నియోజకవర్గంలో చేపట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో 33వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వన్ టౌన్ చిలకపేట ప్రాంతంలో చేపట్టిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజలు అధికార మార్పు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తు ప్రజలను అణచి వేసే ధోరణి అవలంభిస్తుందని ఆరోపించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రతిపక్షాల పై బురదజల్లే కార్యక్రమం తప్ప వైసిపి ప్రభుత్వం ఏనాడు అభివృద్ధి పై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అనూహ్య మార్పులు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ ఆదిమూలం తిరుపతి రావు, ఆర్.సి సాంబ మూర్తి, జెడ్.సి.కే. రాంబాబు, క్లబ్ కమిటీ సభ్యులు పి.సిహెచ్ గుప్త, సిహెచ్.కృష్ణ మోహన్, కందుల కేదార్నాధ్, పి.సత్యనారాయణ, ప్రణీత్, బద్రి, నున్న గోపాల్, ఎం.కె.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.