కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

జగిత్యాల: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లా, జనసేన పార్టీ నాయకులు కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కట్టరాంపూర్ వృద్ధుల వసతి గృహంలో 50 మందికి అన్నదాన కార్యక్రమం, పండ్ల పంపిణి మరియు వృద్ధుల సమక్షంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కందుల రాజిరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని. రానున్న రోజులో ఆంధ్రపరదేశ్ ముఖ్య మంత్రి కావాలని ఆశిస్తునాం అని అన్నారు. జన్మదిన సందర్భంగా అనేక సేవా కార్యకమాలు నిర్వహిస్తు ఈ సందర్భంగా ప్రజలకి సేవ చేసుకునే అదృష్టం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ తరుపున ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ నాయకులు పడాల ప్రసాద్, గౌడ్ హరీష్, సుమన్, సాయి కుమార్, శ్రీనివాస్, హరీష్ కుమార్, రమేష్, శ్రీకాంత్, ప్రణయ్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.