జనసేన విద్యార్థి విభాగం వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన సంపత్ నాయక్

తెలంగాణలో జనసేన విద్యార్థి విభాగం భలోపేతంలో భాగంగా విద్యార్థి విభాగం వాల్ పోస్టర్లు బుధవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మిరియాల ఆవిష్కరించారు. గ్రేటర్ హైదరాబాద్ జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షులు మహేష్ పెంటల మరియు ఓయూ ప్రెసిడెంట్ వినోద్ నాయక్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మోకురాల కృష్ణ, హైదరాబాద్ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శులు తోరం సూర్య, ప్రణీత, ఓయూ కమిటీ సభ్యులు పొన్నం పవన్, మద్దెల అరవింద్, శ్రీనివాస్ చెనిగెల, చిరంజీవి, విజయ్, క్రాంతి, సతీష్, హనుమత్ నాయక్, నిజాం కళాశాల విద్యార్థి నాయకులు మోతిలాల్, నాయకులు, జనసైనికులు, వెంకటేష్, ప్రకాష్, హేమంత్, పాల్గొన్నారు.