అనంతపురం అర్బన్ లో మహిళలతో జనసేన మాటామంతి

  • అంకెల గారడీతో అనంతపురం అర్బన్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న ఎమ్మెల్యే అవినీతి వెంకట రామిరెడ్డి
  • అనంత చేస్తున్నది ఇంటింటికి వైసీపీ కార్యక్రమం కాదు ఇంటింటికి దోచుకొనే కార్యక్రమం
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం అర్బన్: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అనంతపురం అర్బన్ నియోజకవర్గం 9వ డివిజన్ భవాని నగర్ లో పర్యటించి ప్రజలతో మమేకమైన స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంటింటికి వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని 9వ డివిజన్ భవాని నగర్ నుంచి ప్రారంభించి ఈ కలనీలో ఎనలేని అభివృద్ధి చేశామని కోట్ల రూపాయలు ఖర్చు చేసామని మీడియా ముఖంగా అపద్దపు మాటలు చెప్పారని కాని మేము ప్రస్తుతం ఇదే భవాని నగర్ 9వ డివిజన్ లో పర్యటిస్తుంటే ఎమ్మెల్యే చెప్పిన మాటలకు ఇక్కడ వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా ఉందని, ఇక్కడ స్థానిక మహిళలు మాకు రహదారులు సరిగాలేవని, మురుగు కాలువల వ్యవస్త దయనీయంగా ఉందని, వీధి దీపాలు లేవని ఇంటి పట్టాలు పేరుకే ఇచ్చారు కానీ అవి ఏ స్థితిలో ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో వారికి ఇప్పటికీ తెలియని పరిస్థితులో ఉన్నారని ఈ విధంగా భవాని నగర్ ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే ఎమ్మెల్యే కోట్ల రూపాయల అభివృద్ధి చేశామని అర్బన్ ప్రజలను అంకెల గారడీతో మోసం చేస్తున్నాడని కనుక ప్రజలు ఈసారి తప్పకుండా జనసేన టీడీపీ పార్టీలకు ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, స్థానిక డివిజన్ నాయకులు మంజునాథ్, భవాని సాయి, వీరమహిళలు కళ్యాణి, సుమలత, గరులక్షి, సరోజమ్మా, సానియా, చంద్రకళ తదితరులు పాల్గొనడం జరిగింది.