న్యాయవాదులకు సంఘీభావం తెలిపిన జనసేన-టిడిపి నాయకులు

ఏలూరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం (2022 చట్టంను) అమల్లోకి తీసుకువస్తే ప్రజానీకానికి జరిగే నష్టాన్ని అనర్ధాలను తెలియజేస్తూ గత కొద్దిరోజులుగా న్యాయవాదులు జిల్లా కోర్టు నందు విధుల బహిష్కరణ, రిలే నిరాహారదీక్ష రూపంలో ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరిగింది. దీనిలో భాగంగా గురువారం నిరసన ప్రకార్డులతో బైక్ ర్యాలీ అలాగే ముఖ్య కూడలిలో మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఏలూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులను కలసి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.