21వ డివిజన్ జనసేన ఆధ్వర్యంలో వినాయక ప్రతిమల పంపిణీ

కాకినాడ సిటీ, వినాయక చవితి సందర్భంగా కాకినాడ సిటీ 21వ డివిజన్ అధ్యక్షులు మండపాక దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 21వ డివిజన్ అధ్యక్షులు మండపాక దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం అయిన పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత 5 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం విఘ్నేశ్వర ఆశీస్సులతో మట్టి గణపతిని పంపిణీ చేయడం జరుగుతుంది అని, మనం పర్యావరణం కాపాడాలంటే మట్టి గణపతి విగ్రహాలు పూజించాలని, రాబోయే రోజుల్లో ఆ వినాయకుడు ఆశీస్సులు పవన్ కళ్యాణ్ పైన ఉండాలని ఆ దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, 36వ వార్డు జనసేన నాయకులు చీకట్ల శ్రీనివాస్, 21 డివిజన్ కమిటీ సభ్యులు గుర్రాల సతీష్, చిక్కం సూరిబాబు, గ్రంది నాని, విళ్ల సత్తిరాజు, దుర్గా సింగ్ మరియు జనసైనికులు, వీర మహిళలు, గ్రామ ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు.