జగనన్న కాలనీలలో జనసేన వరినాట్ల నిరసన

పిఠాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ పిలుపుమేరకు నూతన ఇన్చార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ సూచనలతో పిఠాపురం నియోజకవర్గంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల దుస్థితి తెలియజేస్తూ కుమారపురం గ్రామంలో #ExposingJaganannaColony, #FailureofJaganannaColony పేరుతో చేసిన డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొన్న నియోజకవర్గ నాయకుల పిల్లా వెంకట దినేష్ మరియు ఉభయ గోదావరి జిల్లాల మహిళా రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధికార ప్రతినిధి శిరీషల ఆధ్వర్యంలో నీటి ముంపు ఎదుర్కొంటున్న జగనన్న కాలనీలలో వరి నాట్లు వేసి వినూత్న నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ఊట నానిబాబు, చెల్లుబోయిన సతీష్, వీరమహిళ పిల్లా రమ్యజ్యోతి, రూరల్ నాయకులు మోటూరి మహేష్, వకపల్లి సూర్యప్రకాష్, రామకృష్ణ, సైతన శ్రీను, మంగుతుర్తి శివ, ఎఫ్.కే పాలెం పట్టాభి, శ్రీను, గంజి గోవిందరాజులు, విరవాడ సూరిబాబు, కుమారపురం రామకృష్ణ, ప్రసాద్, సింగయ్య రాయవరం ప్రసాద్ మరియు రూరల్ మండలం నాయకులు పాల్గొన్నారు.