జనంలోకి బలంగా దూసుకెళ్తున్న ఇంటింటా జనసేన

  • ఇంటింటా జనసేన కార్యక్రమంతో జనంలోకి దూసుకెళ్తున్న జయరాం రెడ్డి

అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో.. శుక్రవారం ఇంటింటా జనసేన కార్యక్రమంలో భాగంగా అనంతపురం నియోజకవర్గంలో 12వ డివిజన్ పాతూరు, తిలక్ రోడ్డు నందు క్రియాశీలక సభ్యులను కలిసి వారి ఇంటికి వెళ్లి క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేస్తూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో… ఆ ఆశయాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, లీగల్ సెల్ల అధ్యక్షులు మురళీకృష్ణ, లాయర్ మధు, వంశీకృష్ణ, మెరుగు శ్రీనివాసులు, భవాని నగర్ మంజునాథ్, ప్రవీణ్ కుమార్, వెంకటాద్రి నాయక్, నారాయణ నాయక్, హేమంత్ నాయక్, కళ్యాణ్, కర్ణ , పురుషోత్తం నాయక్, రాజు, మహేష్ కుమార్, పోతురాజుల అశోక్, పబ్బిశెట్టి మంజునాథ్, ప్రవీణ్ కుమార్, వెంకటకృష్ణ, ప్రతాప్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.