జనసేనాని జన్మదినాన పేద కుటుంబానికి అండగా ఎచ్చెర్ల జనసేన

  • జనసేనాని సేవా స్పూర్తిని ముందుకు తీసుకెళ్ళిన ఎచ్చెర్ల జనసేన నాయకులు

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం, తెప్పలవలస పంచాయతీ నీలంపేట గ్రామంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం కృష్ణాపురం పంచాయతీ జనసేన నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు పిలుపు మేరకు, రణస్థలం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బస్వ గోవిందరెడ్డి ఇటివల మరణించిన యాగాట శివప్రసాద్ కుటుంబానికి 30,000 రూపాయల విలువ గల ఆవును అందించి, వారి కుటుంబ పోషణకు జనసేన తరఫున అండగా నిలిచి జనసేనాని సేవా స్పూర్తిని ముందుకు తీసుకెళ్ళారు. ఈ కార్యాక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రెసిడెంట్ సయ్యద్ విశ్వక్‌సేన్, రణస్థలం మండలం జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనువాస్, దాసరి బలరాం, గోర్లె సూర్య, ఇజ్జిరొతు రమణ, బస్వ రామిరెడ్డి, కిల్లారి కృష్ణా, కాకర్ల బాలాజీ, అప్పన్న, లింగాల సూరిబాబు, కె.బాలు, సత్తిబాబు, చిన్న, రమణ, జనసైనుకులు తదితరులు పాల్గొన్నారు.