అవినీతి, అక్రమాలను అడ్డుకునేందుకే జనసేన జనగర్జన: నందగిరి సతీష్

తెలంగాణ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం డివిజన్ పరిధిలోని విన్ ప్యాలస్ ఫంక్షన్ హాలులో ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ నందగిరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన జనగర్జన మరియు క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, సత్తెనపల్లి నియోజకవర్గ నియోజకవర్గ జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను బలోపేతం చేయాలని అన్నారు. అసమర్థుడిగా ఇంట్లో ఉండిపోతావో, సమర్ధుడిగా రాజకీయ ప్రక్షాళనకు సిద్ధం అవుతావో ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించాలని అన్నారు. రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ ప్రాంతం అంతా జనసేన పార్టీకి మద్దతుగా నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని అలాగే ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గ అభ్యర్థి అయిన వేమూరి శంకర్ గౌడ్ మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభ్యర్థి నందగిరి సతీష్ కుమార్ విజయానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం వారి చేతుల మీదుగా జనసేన పాఋటీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచేందుకు రూపొందించిన క్రియాశీలక సభ్యత్వ కిట్లను సభ్యత్వం తీసుకున్న క్రియాశీలక సభ్యులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ సభ్యులు, వివిధ నియోజకవర్గాల ఇంచార్జులు, జనసేన శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.