సింగరాయకొండ సమస్యలపై కలెక్టరుకి జనసేన వినతిపత్రం

కొండెపి, సింగరాయకొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరయిన సదుపాయాలు లేక ప్రజలు ఎదురుకుటున్న సమస్యల విషయంపై సోమవారం ఒంగోలులోని కలెక్టర్ కి మరియు డి.ఎం.హెచ్.ఓ కి జనసేన పార్టీ అధ్వరంలో వినతిపత్రం అందజేయటం జరిగింది. మరియు సింగరాయకొండలో పలు సమస్యలు వీధి లైట్లు, డ్రైనేజీ, కనుమల రోడ్డులోని నిల్వ ఉన్న మురికినీటి విషయం గురించి, ట్రంకు రోడ్డులోని గుంటల గురించి, గతంలో పంచాయతీకి అర్జీలు ఇచ్చినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు ఒక పని కూడా చేయలేదని జిల్లా కలెక్టర్ కి సింగరాయకొండలోని సమస్యల గురించి వినతిపత్రం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు అయినా బత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు శశి భూషణ్, వీర మహిళలు రాధిక, ప్రమీల, రజిని జనసేన నాయకులు కాసుల శ్రీనివాస్, అనుముల శెట్టి కిరణ్ బాబు, సంకే నాగరాజు, సయ్యద్ చాన్ భాషా, షేక్ సుల్తాన్ భాషా, పసుమర్తి నాగేశ్వరరావు, నామ మహేష్, కుమార్, నాగమల్లి హరికృష్ణ, క్రాంతి, చుండురి మాధవ, పోలిశెట్టి విజయ్ కుమార్, షేక్ మా బాషా, నాగరాజు, షను మరియు జన సైనికులు పాల్గొన్నారు.