ప్రజా సమస్యలపై జనసేన పోరాటం

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నందు 15,16,17,18 వార్డుల నుండి చెరువుకి ప్రవహించే నీటి సప్లయ్ ఛానల్ అధికారుల, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యంతో గత సంవత్సరం నుండి చెత్త, చెదారంతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతూ స్థానిక వార్డు ప్రజలు అనేక అనారోగ్యాలకు గురి అవుతున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు మరియు అధికార పార్టీ నాయకులకు తెలియజేయగా నిర్లక్ష్య ధోరణితో వర్తిస్తూండగా, వార్డుల ప్రజలు సమస్య పరిష్కారం కోసం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ని ఆశ్రయించగా తక్షణమే ఇమ్మడి కాశీనాధ్ ఆ ప్రాంతాన్ని సందర్శించి సంబంధిత మున్సిపల్ అధికారులతో మరియు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ సమస్యను పరిష్కరించకపోతే సంబంధిత కార్యాలయాలను ఆ ప్రాంత ప్రజలతో ముట్టడిస్తామని హెచ్చరించారు. త్వరితగతిన ఆ సమస్యను పరిష్కరించాలని తెలిపారు.