విడివాడ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన – జనంకోసం జనసేన

తణుకు నియోజకవర్గం, తణుకు పట్టణంలోని 21వ వార్డు నుండి తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన – జనంకోసం జనసేన అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడుతూ నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూస్తున్నాను మేము అధికారంలోకి రాగానే మీ సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నామ మాత్రపు చర్యగా చేశారు. మేము అధికారంలోకి రాగానే యువతకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్న జగన్ మోహన్ రెడ్డి హామీలను తుంగలో తొక్కారని విడివాడ రామచంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్ తణుకు టౌన్ యూత్ అధ్యక్షుడు గర్రె తులసీరామ్ తణుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు చిక్కాల వేణు ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశి, 26వ వార్డు జనసేన నాయకులు రెల్లు పండు, రెల్లు చందు, దుర్గేష్ మరియు టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, జనసేన పార్టీ జిల్లా సెక్రెటరీ తామరపు నరసింహారావు తణుకు నియోజకవర్గంలో లీగల్ సెల్ సెక్రెటరీ కొయ్యల విజయ్ కుమార్ దువ్వ గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీరాములు చిన్ని తూర్పు విప్పర్రు గ్రామం జనసేన పార్టీ అధ్యక్షుడు కటికిరెడ్డి శ్రీనివాస్, కురసాల శ్రీనివాస్, జవ్వాది ప్రసాదు, శివటం శీను, సతీష్, వీరమహిళలు సునీత, ఎండ్రా రత్న జ్యోతి, కామవరపు రూప మరియు జనసేన పార్టీ నాయకులు జనసైనికులు, వీరమహిళలు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.