మిన్నంటిన జననాయకుడి జన్మదిన వేడుకలు

  • అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు అయినా తగ్గని జనసైనికులు

ఇచ్చాపురం: జనసేన నాయకులు లోళ్ల రాజేష్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పుట్టినరోజు వేడుకకు జనసైనికులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కవిటి – ఈదుపురం- ఇచ్చాపురం మీదగా కంచిలి- సోంపేట నుండి కవిటి చేరుకోగా అక్కడక్కడ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. స్వేచ్చలేని ప్రజాస్వామ్య రాష్ట్రంలో బతుకుతున్నామని, ప్రతిపక్షాలను అనగదొక్కే రీతి ఇది కాదు అని, ఏదైనా రాజకీయంగా మాట్లాడాలని, పోలీసులు పెట్టి జన్మదిన వేడుకలు కూడా ఆపడం చాలా సిగ్గుచేటని, జనసైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చిన్న చిన్న విషయాలకు భయపడేది లేదని ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని రాజేష్ అన్నారు. ఈ ఈ ర్యాలీలో నియోజకవర్గ జనసైనికులు, వీరమహిళలు, ప్రజలు, భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.