కవిటి లో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం

జనసేన ఇచ్చాపురం నియోజకవర్గం, కవిటి మండలం.. కవిటి లో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి రాజు ఆధ్వర్యంలో.. రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, మరియు మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా సమక్షంలో అదినాయకుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రాసిన మనోగతాన్ని చదివి వినిపించడం జరిగింది. కురుస్తున్న వర్షానికి లెక్కచేయకుండా జనసైనికులు, జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు సమక్షంలో కిట్ల పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి బార్ల ప్రదీప్, శైలజ, సురేష్, రాజశేఖర్, రామకృష్ణయ్య, బైపాలి దాలయ్య, బడే రాజు, ధనుంజయ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.