బెల్లంకొండ సాయి బాబు చేతుల మీదుగా జనసేన సభ్యత నమోదు కిట్లు పంపిణీ..

ప్రకాశం జిల్లా, కొమరోలులో గిద్దలూరు జనసేన పార్టీ ఇన్చార్జ్ బెల్లంకొండ సాయి బాబు ముఖ్యఅతిథిగా.. ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జల కొండ నారాయణ, కొమరోలు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు సారే ఓబులేసు నాయుడు ఆధ్వర్యంలో.. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సభ్యత నమోదు చేసుకున్న జనసేన కార్యకర్తలకు సభ్యత నమోదు కిట్లను బెల్లంకొండ సాయి బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన కొంతమంది యువకులు బెల్లంకొండ సాయి బాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి బాబు మాట్లాడుతూ.. ప్రస్తుత వైసిపి ప్రభుత్వ పాలన లో ప్రజలు ఎవరూ సంతృప్తిగా లేరన్నారు. విపరీతమైన విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. ఎక్కడ చూసినా అవినీతి ఉందని చెప్పారు. జనసేన పార్టీ గిద్దలూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలలో గెలిచి తీరుతుందని.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతామని అన్నారు. జనసేన పార్టీ సభ్యత నమోదు సంఖ్యను గణనీయంగా పెంచిన ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణను అభినందిస్తూ.. ఘనంగా సన్మానం సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంక నరసింహారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి, కాలువ బాల రంగయ్య, జనసేన సీనియర్ నాయకులు సిద్ధం వెంకటేశ్వర్లు, మండల నాయకులు భూమా లక్ష్మణ్, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.