యాదమరి మండలంలోని ప్రధాన రహదారి అద్వాన్న పరిస్థితులపై జనసేన అఖిలపక్ష సమావేశం

పూతలపట్టు: జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండల అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని ప్రధాన రహదారి అద్వాన్న పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో యాదమరి మండలం పోలీస్ స్టేషన్ నుంచి తమిళనాడు సరిహద్దు వరకు ఉన్న రోడ్లు బాగు చేసేంతవరకు వివిధ మార్గాల్లో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకునే ప్రయత్నాలు నిర్విరామంగా చెయ్యాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా త్వరలో ఎంపీడీవో గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కుమార్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ రామ్మూర్తి, సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, జనసేన పార్టీ యాదమరి మండలం ప్రధాన కార్యదర్శి వేముల పవన్, కార్యదర్శి చంద్ర, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆవుల శాంతమూర్తి, పూల చందు, నానబాల లోకేష్, వెంకటేష్, ఎం వెంకటేష్ ప్రభాకర్ పాల్గొనడం జరిగింది.