ఉమ్మడి కార్యాచరణపై జనసేన, టిడిపిల సమావేశం

పిఠాపురం నియోజకవర్గం: జనసేన అధినేత ప్రకటించిన విధంగా జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో జనసేన, టిడిపి పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించడం కోసం. తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ భాషను కలిసి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, జనసేన నాయకులు దారం హరిప్రసాద్ తులసి శ్రీనివాసులు, పవర్ ఆఫ్ ద టీం అధ్యక్షులు గోమ్మిశెట్టి గోపాలకృష్ణ, సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి, రామిశెట్టి నాగరాజు కురవ పాల్గుణ బండి భార్గవి, శివకుమార్ జనసేన నాయకులు శ్రీనివాసులు, ఆకుల శంకర అశ్వర్థ, ధరణి స్టూడెంట్ వింగ్ సభ్యులు షేక్ సోను, సుప్రీం హర్ష నరేంద్ర తెలుగుదేశం నాయకులు బాలమణి శేఖర్, ధరణి తదితరులు పాల్గొని చర్చించడం జరిగింది. త్వరలో ఉమ్మడి కార్యచరణ ప్రకటించడం జరుగుతుందని తెలియజేసారు.