P.Gannavaram: వివేకానంద మనో వికాస కేంద్రంలో జనసేన అన్నదాన కార్యక్రమం

పి.గన్నవరం నియోజకవర్గం ‘బెల్లంపూడి’ గ్రామం జనసేన పార్టీ మెదటి వార్డు మెంబర్ శ్రీ వర్థినీడి రాంబాబు పుట్టినరోజు సందర్భంగా రాజోలులోని వివేకానంద మనో వికాస కేంద్రంలోని దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. నిత్యావసర సరుకులు, కాయకూరలు, పళ్ళు బెల్లంపూడి జనసైనికులు చేతులు మీదుగా అందచేశారు. శ్రీ వర్థినీడి రాంబాబు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఇలాంటి సహాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. వీరికి మనో వికాసకేంద్రం ఫౌండర్ ఎం.లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.