అగ్నిప్రమాద బాధితులకు బాసటగా జనసేన

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం మేజర్ పంచాయతీ శివారు గోకులపాడు గ్రామంలో గంటాడ లోవరాజు ఇల్లు అగ్ని ప్రమాదం జరగడం వలన కట్టుబట్టలు తప్ప సమస్తం కాలి బూడిద అయిపోయిన విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు శానాపతి బాబురావు మాస్టారు ఆధ్వర్యంలో తిమ్మాపురం పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షులు ప్రసాదుల గణేష్, మరియు మత్తి కార్తీక్ చేతుల మీదుగా 5000₹ రూపాయల నగదు మరియు రెండు నెలలు సరిపడా నిత్యావసర సరుకులు, బట్టలు, వారి కుటుంబానికి అందజేశారు. ఈ సహాయంతో మరిచిపోయే పార్టీ కాదు మా జనసేన పార్టీ మీ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుందని మాట్లాడారు. ఇంటి పనులు చేపడితే ఇంటి నిర్మాణం కొరకు 20 బస్తాల సిమెంటు మరియు ఇంటికి కావలసిన ఎలక్ట్రికల్ కరెంటు మీటరుతో సహ వైరింగ్ వర్కులు చేయిస్తామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ లింగంపల్లి జ్యోతి కుమార్, కోన దుర్గాప్రసాద్, తిమ్మాపురం ఎం.పి.టి.సి అభ్యర్థి, పప్పల శివ, గోకులపాడు ఎం.పి.టి.సి అభ్యర్థి బలంకి రాజు, మీడియా ఇన్ఛార్జి నక్క శ్రీనివాసు, వీర మహిళ కలగట్ల లలితా, కోలపాటి బాబుజి, కోత్వల శ్రీనివాసు, సేనాపతి నానాజీ, కోలంటి మురళి, లింగంపల్లి నానాజీ, పులి సత్తిబాబు, దమ్ము రాజు, అప్పికొండ లోవరాజు, రాజు, కోటి, టేకు చందు, రాజశేఖర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.