పితాని ఆధ్వర్యంలో ‘నా సేన నా కోసం నా వంతు’

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ‘నా సేన నా కోసం నీ వంతు’ కార్యక్రమంలో కాట్రేనికోన మండలం కొప్పు గుంట, ఘాజింగి తిప్ప, కందిపప్పు, పల్లంకూరు గ్రామాల్లో పర్యటించి కొంతమంది పెద్దలను కలవడం జరిగింది. మరియు ఘాజింగి తిప్ప గ్రామంలో ప్రమాదవశాత్తు గాయపడిన గుద్దటి మణికంఠ, అనారోగ్యంతో బాధపడుతున్న పలసాని నరసింహారావు, మరియు రోడ్డు ప్రమాదంలో గాయపడిన పలసాని చిన్నలను పరామర్శించడం జరిగింది. మరియు కందికుప్ప గ్రామంలో తోకల వారి పేటలో అనారోగ్యంతో బాధపడుతున్న బల్ల శ్రీనుని పరామర్శించారు మరియు కాట్రేనికోన గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న బలసాని కాసులయ్యని పరామర్శించారు. అదేవిధంగా కందికుప్ప పల్లంకూరు ప్రధాన రహదారి చిన్నపాటి వర్షానికి కూడా పూర్తిగా జలమయం అయిన సందర్భాన్ని రోడ్డుని చూపిస్తూ జగన్ మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా పరిపాలన చేస్తున్నానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన లోపాలను చూపించి గొప్పలు చెప్పుకోవడం కాదు మొత్తం రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా వేసేసానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ రహదారిని వెంటనే నిర్మించాలని జనసేన పార్టీ తరఫున పితాని బాలకృష్ణ డిమాండ్ చేశారు, వీరి వెంట సీనియర్ నాయకులు నూకల దుర్గ బాబు, సంసాని పాండురంగారావు, బల్ల కుమార్, పిల్లి గోపి, దొమ్మేటి రాధాకృష్ణ, గిడ్డి రత్నశ్రీ, దూడల స్వామి, పాయసం సాయి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.